పెషావర్: పురావస్తు శాఖ నిపుణులు పాకిస్థాన్ లో 3వేల ఏళ్ల కిందటి పట్టణాన్ని గుర్తించారు. వాయువ్య పాకిస్థాన్లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్ స్వాత్ జిల్లాలోని బరికోట్ తహసీల్ పరిధిలో గుర్తించిన ఈ నగరం పేరు బజీరా. పురావస్తు శాఖ పరిశోధనలో 5 వేల ఏళ్ల క్రితం ప్రాచుర్యంలో ఉన్న ప్రాచీన నాగరికతకు సంబంధించిన కళాఖండాలు, హిందూ దేవాలయాలు, నాణేలు, స్థూపాలు, కుండలు, ఆయుధాలను కూడా గుర్తించారు. క్రీస్తుపూర్వం 326 కాలంలో అలెగ్జాండర్ చక్రవర్తి తన ఆర్మీతో కలిసి స్వాత్ జిల్లాలోని ఒడిగ్రామ్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఓడించి..బజీరా నగరాన్ని, కోటను నిర్మించారని నిపుణులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అలెగ్జాండర్కు పూర్వం నివసించిన వారి ఆనవాళ్లను కూడా పురావస్తు నిపుణులు గుర్తించారు. అలెగ్జాండర్కు ముందు ఇండో-గ్రీక్, బుధ్మట్, హిందూ షాహి, ముస్లింలు ఈ ప్రాంతంలో జీవించేవారు.